జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు క్రీడా పోటీలు

Published: Thursday January 12, 2023

ఇబ్రహీంపట్నం, జనవరి11( ప్రజాపాలన ప్రతినిధి) మండలంలోని వర్షకొండ గ్రామంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  పోలీస్ శాఖ  ఆధ్వర్యంలో  జనవరి 12 స్వామి వివేకానంద జయంతి(నేషనల్ యూత్  డే )ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం  అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాములు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల క్రమశిక్షణ,స్నేహ భావము, మరియు పోటీ తత్వము అలవడుతుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొంతుల  శ్యామల తుక్కారం, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ పొనకంటి చిన్న వెంకట్,ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాకేష్, వార్డ్ మెంబరు స ల్వాల రమేష్, నాయకులు తుకారం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.