ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి. వీఆర్ఏలకు సంఘీభావం తెలిపిన మల్ రెడ్డి రంగార

Published: Thursday August 04, 2022

ఈ రోజు యాచారం మండల కేంద్రంలో   వీఆర్ఏల  ఎమ్మార్పీఎస్  సంఘాల నిరవధిక సమ్మెలకు సంఘీభావం ప్రకటించిన ఇబ్రహీంపట్నం నియోజవర్గ ఇన్చార్జ్ ముద్దుబిడ్డ  మల్ రెడ్డి రంగా రెడ్డి . మాట్లాడుతూ వీఆర్ఏలకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వం వెనుకబాటు తనని మానుకోవాలని  వారికి వచ్చే స్కేల్ తప్పకుండా ఇవ్వాలని లేనియెడల పోరాటం ఉదృతం చేస్తామని  రంగారెడ్డి హెచ్చరించారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇంతవరకు ఎక్కడ కూడా అమరుపరచలేని పరిస్థితి ఈ టీఆర్ఎస్ పాలన,  ఉపాధి హామీ ఫీల్డ్  అసిస్టెంట్  ఉద్యోగాల మాట ఎటు పోయింది  అసెంబ్లీలో ఇచ్చిన మాట నీటి మూటలు గాని మిగిలిపోయారా వారిని బజారున పడేసినటువంటి ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం . ఈరోజు వీఆర్వోలకు పరిస్థితి కూడా అదే గతిపాలవుతుందా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క సమస్యను వెంబడి పరిష్కరించే విధంగా చూస్తామని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.