దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : బెల్లంపల్లి అఖిలపక్షం డిమాండ్

Published: Monday June 07, 2021

బెల్లంపల్లి, జూన్ 6, ప్రజాపాలన ప్రతినిధి : ప్రేమ వ్యవహారంలో రాజశేఖర్ అనే వ్యక్తిని మారణాయుధాలతో దాడి చేసి  చనిపోయాడని వదిలిపెట్టి పోయినా హంతకులను వెంటనే అరెస్టు చేసి  చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం నాడు పత్రికలకు వారు ప్రకటన విడుదల చేస్తూ రాజశేఖర్ అనే వ్యక్తి ప్రేమ వ్యవహారంలో తలదూర్చాడని మారణాయుధాలతో దాడి చేసిన రాగం శెట్టి సతీష్ అనే వ్యక్తి తన అనుచరులతో దాడి చేయగా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు స్థానిక పోలీసులు పట్టించుకోవడంలేదని పేదోడికి ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయం అనే విధంగా రాజశేఖర్ పై జరిగిన దాడి విషయంలో అతనికి న్యాయం జరిగే పరిస్థితి లేదని రాజశేఖర్ కు అఖిలపక్షం అండగా ఉంటుందని అన్నారు, దాడి చేసిన నిందితుల మీద కేసు నమోదు చేసి  జైలుకు పంపే వరకు మా పోరాటం చేస్తామని వెంటనే దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోగర్ల శంకర్, ఆడెపు మహేష్, ప్రకాష్, కాంట్రాక్ట్ బస్తీ ప్రజలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.