తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృష్ణమాచారి

Published: Monday June 13, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 12 ప్రజాపాలన ప్రతినిధి.

ఆదివారం రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ చింతకింది చక్రపాణి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు అధ్యక్షులు కుందారపు కృష్ణమాచారి గారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది,అనంతరం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు,అలాగే నియోజకవర్గంలో కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు జక్క రామ్ రెడ్డి, తెలుగు యువత భువనగిరి పార్లమెంటు అధ్యక్షులు జక్కా కర్ణాకర్ రెడ్డి, తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి ఇందిరా, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వంగాల కృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షులు రామనాథం, మున్సిపాలిటీ అధ్యక్షులు రావుల వీరేశం, మజ్జిగ లక్ష్మారెడ్డి, బ్రహ్మచారి, మహేందర్, నక్క మహేందర్,రాజేష్ యాదవ్,బొమ్మకంటి అశోక్, రాందాస్, కాసోజు వీరాచారి, కప్పరి అంజయ్య,బిక్షపతి,శంకర్,యాదగిరి,వెంకటేష్, బద్రయ్య,కృష్ణవేణి,మల్లమ్మ,మహేష్ పెద్దఎత్తున తదితరులు పాల్గొన్నారు.