కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి అనే అసత్య ప్రచారాన్ని ఖండించిన జిల్లా నాయకులు డా కోట రాంబాబ

Published: Monday January 23, 2023
రూరల్ జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో శనివారం నాడు కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి అనే అసత్య ప్రచారం ఖండిస్తూ జిల్లా నాయకులు డాక్టర్ రాంబాబు పేర్కొన్నారు భట్టి నీ వక్రబుద్ధిని ప్రజలు ఎవ్వరూ నమ్మరు నిన్న ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఖమ్మం  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే అసత్య ప్రచారాన్ని జిల్లా నాయకులు ప్రముఖ వైద్యులు డా కోట రాంబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది అసత్య ప్రచారం అని, మల్లు భట్టి విక్రమార్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోకి పొంగులేటి అనే అసత్య ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇటువంటి అసత్య ప్రచారాలు ఆయన సహజంగానే చేస్తాడు,భట్టి నీ వక్రబుద్ధిని మానుకో..... నువ్వు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన మధిర నియోజకవర్గ ప్రజలు నమ్మరు. నువ్వు చేస్తున్నటువంటి కోవర్టు రాజకీయాల వల్ల అధిష్టానం దగ్గర విశ్వసనీయత కోల్పోయావు . దానివలన మతి భ్రమించి ఈరోజు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని ఒక కొత్త పుకారుకు నాంది పలికావు.నిన్ను మధిర నియోజకవర్గం ప్రజలు సాగనంపే సమయం దగ్గరలోనే ఉంది. ప్రజలు ఎవ్వరూ కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మకండి. పొంగులేటి ఏ పార్టీ లోకి వెళ్లినా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలిపి వారి సంఘీభావం తోనే వెళ్తారు.ఈరోజు విలేఖలు సమావేశం లో డీసీసీబీ డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వరరెడ్డి , అనంతరెడ్డి , ఉమ్మినేని కృష్ణ , వేమిరెడ్డి లక్ష్మారెడ్డ, కటికల సీతారామి రెడ్డి , శీలం వెంకట్రామిరెడ్డి  కిరణ్  తదితరులు పాల్గొన్నారు.