విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే గేదెలు మృతి

Published: Tuesday August 17, 2021
మధిర, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : రెండు లక్షన్నర రూపాయలు నష్ట పరిహారం ఇచ్చి పాడి రైతులను ఆదుకోవాలని సిపిఐ డిమాండ్ మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో ఈరోజు 6వ వార్డు లో కరెంటు షాక్ తో సుమారు రెండు లక్షన్నర విలువచేసే పిండి కృష్ణ కు చెందిన గేదెలు మృతి చెందగా ఘటనా స్థలాన్ని సిపిఐ మధిర మండల కార్యదర్శి ఓట్ల కొండలరావు మండల కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్లే గేదెలు మృతి చెందినయని గత రెండు రోజుల నుంచి స్తంభం వైర్లు వేలాడు పడుతున్నా మరమ్మతులు చెయ్యకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తక్షణమే రైతుకు రెండు లక్షన్నర రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.