క్షయ వ్యాధి నివారణే లక్ష్యం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వి సుబ్బారావు

Published: Saturday November 26, 2022

మధిర రూరల్ నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) దేశంలో 2025 నాటికి క్షయ వ్యాధిని నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వి సుబ్బారావు తెలిపారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని వారికి శుక్రవారం పోషకాహారం కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం ఉచితంగా అందించే విలువైన మందులను, సంపూర్ణ పోషక ఆహారాన్ని పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.