ఘనంగా పదవీ విరమణ సన్మానం.

Published: Saturday November 26, 2022

కొడిమ్యాల, నవంబర్ 25 (ప్రజా పాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేముల రాజమ్మ పదవీ విరమణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై రాజమ్మ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని అక్షరాలు అందరికీ అందాలని తపించి పాఠశాలల పవిత్రంగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య వారధిగా పనిచేసిన రాజమ్మకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు. అనంతరం వచ్చిన అతిథులచే రాజమ్మను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మ్యాజిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యతీరాజ్  మ్యాజిక్ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పిటిసి పుణుగోటి  ప్రశాంతి, సర్పంచ్ ఏలేటి మమత- నరసింహారెడ్డి, గౌరాపూర్ సర్పంచ్ బొడ్డు విజయ -రమేష్ ,
వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్ ,గౌరాపురం ఎంపిటిసి మ్యాక మరియ రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో అధ్యక్షులు మేనేని రాజ నర్సింగ రావు, బండ రవీందర్ రెడ్డి, మండల విద్యాధికారి
ఏ శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎం నాంపల్లి మల్లేశం,
ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం సత్యం,
ఏ మల్లారెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ ,ఎస్ఎంసి చైర్మన్ కె. గంగాచారి టిపియుఎస్ అధ్యక్షులు హరికృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.