యం ఎస్పి జిల్లా సదస్సును జయప్రదం చేయండి. -బచ్చలకూర వెంకటేశ్వర్లు

Published: Friday May 27, 2022
భద్రాద్రి కొత్త గూడెం(ప్రజాపాలన)ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్
స్థానిక టీఎన్జీవో కార్యాలయం భద్రాచలం నందు భద్రాచలం నియోజకవర్గ స్థాయి మహాజన సోషలిస్టు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అలవాల రాజా పెరియర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ  ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బచ్చలకూర వెంకటేశ్వర్లు  పాల్గొని మాట్లాడుతూ.... మహాజన సోషలిస్టు పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడదని,ఏ అధికారం లేకుండానే మహా జనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ వికలాంగుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం పోరాటం చేస్తుందని,తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధన,ఆరోగ్యశ్రీ ద్వారా పేద వర్గాలకు వైద్యం,వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛను పెంపు ఉద్యమం,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ,అత్యాచార బాధితుల పక్షాన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు,తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలు మహాజన సోషలిస్టు పార్టీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ సాధించి పెట్టిన అని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాలతో ఏర్పడితే ఆత్యాగాల పునాదుల దొరల కుటుంబం పాలన కొనసాగుతోందని అన్నారు.దొర నిరంకుశ పాలనను అంతమొందించాలంటే మహాజన సోషలిస్టు పార్టీని ఆదరించాలని అని పిలుపునిచ్చారు.మహాజన సోషలిస్టు పార్టీ ఉద్యమ నిర్మాణంలో భాగంగా జూన్ 4న మహాజన జిల్లా సదస్సు భద్రాచలం నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ జిల్లా సదస్సుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగుల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యం ఎస్ పి జిల్లా కోఆర్డినేటర్ దేపంగి రమణయ్యమాదిగ,మహాజన మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గుర్రం నాగమణి,జిల్లా అధికార ప్రతినిధి ఇల్లందుల హేమలత,వేముల నిర్మల,మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు ఉంగుటూరు వీరరాఘవులు,తోకల దుర్గాప్రసాద్, సోమక కుమార్,కనుక శ్రీనివాస్,బొక్క రాంబాబు మాదిగ,కోట రవి,బాలకృష్ణ కొత్తపల్లి,కూరపాటి కిట్టు,కళ్యాణి,రజిత,మాణిక్య రావు,తదితరులు పాల్గొన్నారు.