ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై సర్వే : ఎంపీడీఓ చంద్రశేఖర్

Published: Friday May 07, 2021

గుమ్మడిదల, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో గురువారం రోజున గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితి పై ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అని గ్రామాలలో బృందాలుగా ఏర్పడి మండలంలో ప్రతి ఇంటింటికి అధికారులు వెళ్లి ఇంట్లో ఉన్న ప్రతి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని, ఎవరు కూడా ఏలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా అనుమానంతో గుంపులు గుంపులుగా కరోనా పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రంకు వెళ్లి లేని రోగం తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం ప్రతిఒక్కరు బాధ్యతయుతంగా వ్యవహరించి తమకు తాముగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, సామాజిక దూరం పాటిస్తూ, నోటి మాస్కులు, శానీటేజర్లు వాడాలని అత్యవసరం ఐతే తప్ప ఎవరూ కూడా బయట రవ్వొద్దని ఆయన తెలిపారు. ఆరోగ్యం గా ఉంటే ఏదైనా సాదించవచ్చాని, అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉరికె అనలేదని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఎంపీఓ దయాకర్ రావు కార్యదర్శి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.