రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Published: Friday January 20, 2023
బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ రజిత
మేడిపల్లి, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, మీర్పేట్ హెచ్.బికాలనీ, ఏఎస్ రావు నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు అధికారులతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.
ఉప్పల్ ఇందిరానగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ రజిత పరమాశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి వెలుగు ఒక అద్బుత కార్యక్రమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి నారాయణ రావు, మల్కాజ్గిరి ఎసిపి నరేష్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు శంకర్,అరుణకుమారి, డాక్టర్లు సౌందర్య లతా, మంజుల వాణి, మాధవి, మహమ్మద్ సబ్బియుద్దీన్ రమాదేవి, వైద్య బృందం ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి,డాక్టర్ దివ్య, మెడికల్ సూపర్వైజర్ భోగ ప్రకాష్ కార్పొరేటర్లు శాంతి సాయిజన శేఖర్ , పన్నల దేవేందర్ రెడ్డి, జేరిపోతుల ప్రభుదాస్, శిరీష సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: