బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకం : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Friday January 07, 2022
వికారాబాద్ బ్యూరో 06 జనవరి ప్రజాపాలన : ఉపాధ్యాయుల అన్ని కేటగిరిలలో బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలియజేసినారు. గురువారం స్థానిక డిపిఆర్సి భవనములో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా విద్యా శాఖ అధికారిణి రేణుకదేవిలతో కలసి కలెక్టర్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ నిర్వహించారు.  మొత్తం మూడు విడతలుగా మంగళవారం రోజు (18) మందికి, బుధవారం (58) మందికి గురువారం (877) మందితో కలిపి జిల్లాలో మొత్తం (953) మందికి ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.