కరోనా వ్యాక్సిలేషన్ సెంటర్ ప్రారంభించిన తుర్కయంజాల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కరాడి శ్రీలత అన

Published: Tuesday August 02, 2022

   ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధిఉమార్ ఖాన్ గూడ వార్డు కార్యాలయం నందు కరోణ వ్యాక్సినేషన్ సెంటర్ ను కరాడి శ్రీలత అనిల్ కుమార్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చేతులు మీద ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాడి శ్రీ లత అనిల్ కుమార్ కౌన్సిలర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దేశ ప్రజల సంక్షేమం కోసం ఏదైతే కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి మన వార్డు కార్యలామం నందు విద్యార్థినీ విద్యార్థులకు పెద్ద మనుషులకు అలాగే అర్హత ఉన్న వారందరికీ కరోణ నిర్మూలన కోసం కోరబో వాక్స్ వాక్సిన్, కోవిడ్ షీల్డ్ మరియు కో వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వేయించుకోవలిసిందిగా కోరడమైనది. తల్లిదండ్రులు విద్యార్థులు విద్యార్థినిలు ప్రజలూరు కూడా అపోహలు పడకుండా భయపడకుండా 12ల సంవత్సరాల పైబడిన వారికీ అందరికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో మన వార్డు నందు అలాగే మన మునిసిపాలిటీ మరియు మన నియోజకవర్గం రాష్ట్రం దేశం మొత్తం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కరోనా నిర్మూలన కోసం స్వచ్ఛందంగా తమ వంతుగా ముందుకు రావాలని తల్లిదండ్రులను ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్ల నరసింహారెడ్డి , నల్ల బాల్ రెడ్డి, నల్ల ధర్మారెడ్డి, సతీష్ రెడ్డి, నల్ల మల్లారెడ్డి, బండారు శ్రీశైలం, రంగనాథ్ వైద్య సిబ్బంది వజ్ర , స్వరూప, ఆశా వర్కర్లు మాధవి , భాగ్య లక్ష్మి,లావణ్య, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.