ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి చేవెళ్ల నియోజకవర్గం: ప్రజాపాలన :

Published: Friday November 18, 2022
మొయినాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్,శ్రీనివాస్ అన్నారు....... ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్,శ్రీనివాస్.......... మాట్లాడుతూ మొయినాబాద్ హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న చాలా గ్రామాలు పేదరికంతో ఉన్నారని పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదని దానిని వెంటనే స్థాపించాలని చాలా మంది పేద విద్యార్థులు హైదరాబాదు వెళ్లి చదువుకోలేక విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ స్పందించి మొయినాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.