ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

Published: Saturday November 19, 2022

బోనకల్, నవంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి : మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కలకోట రెవిన్యూ పరిధిలోని కలకోట, రాయన్నపేట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు తో కలిసి సర్పంచ్ లు యంగల దయామణి,కిన్నెర వాణి లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగపరుచుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చావహరిత, సిఇఓ మల్లిఖార్జున్, అమరయ్య,రామకృష్ణ,ప్రభాకర్,కలకోట,రాయన్న పేట రైతులు చావా లక్ష్మణరావు, మోహనరావు ,అప్పారావు, ఇటికల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.