శంకరపట్నంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, విస్మరించినా అంబేద్కర్ చిత్రపటాలు శంకరపట్నం జ

Published: Friday January 27, 2023
శంకరపట్నం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిద గ్రామాల్లోని పాటశాలల్లో,  గ్రామపంచాయితీ కార్యాలయాల్లో వివిద సంఘాల అద్వర్యంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రం లోని ఎమ్మార్వో, ఎంపీడీవో, అగ్రికల్చర్ ,వివో, కార్యాలయాల్లో, వివిధ సంఘాల్లో, వివిధ రాజకీయ పార్టీలా ఆధ్వర్యంలో పథకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  వివిధ స్థాయి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున అక్కడక్కడ రాజ్యంగ నిర్మాత అయినటువంటి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని విస్మరించి పథకావిష్కరణ గావించినట్టు అంబేద్కర్ వాదులు వాపోయారు.మిగితా నాయకులు స్వతంత్ర యోదుల చిత్రపటాల పక్కన అయిన అంబేద్కర్ చిత్రపటాన్ని ఖచితంగా ఉంచి ఆ మహనియుణ్ణి గౌరవించే బాద్యత ప్రతీఒక్కరి పైన ఉన్నధని వారు అభిప్రాయపడ్డారు.