మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కార్పొరేటర్లు

Published: Wednesday April 12, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 11 (ప్రజాపాలన ప్రతినిధి)
సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలను  రామంతపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల సందర్భంగా రామంతాపూర్
ప్రధాన రహదారిలో గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, 
 బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, రామంతాపూర్, హబ్సిగూడ కార్పొరేటర్లు బండారు శ్రీవాణి వెంకట్రావు, కక్కిరేణి చేతన హరీష్. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ అభ్యున్నతికి బాలిక విద్య, కుల వివక్షకు, వ్యతిరేకంగా పోరాటం చేసిన సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు, ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్, రేవు నరసింహ కురుమ, తిరుపతయ్య, లింగం, సోమశేఖర్ గౌడ్, నారాయణ దాస్
జగదీష్, బాలకృష్ణ, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, నిరంజన్ గౌడ్, ఉపేందర్ యాదవ్, కామేశ్వరరావు, నాగేష్, శ్రీనివాస్, పర్వతాలు, వెంకన్న, దేవా, ప్రభాకర్ రెడ్డి, రఘుపతి గౌడ్,  ,  కైలాస్పతి గౌడ్, శ్రీనివాస్, వెంకన్న,  సురేష్ , చెల్లోజు ఎల్లాచారి, రవీందర్, శాంతి కుమార్ నోముల, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.