నేటి నుండి గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము

Published: Monday October 18, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం, పశువైద్య మరియు పశుసంవర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో నేడు అనగా 18-10-2021 నుండి 18-11-2-21 వరకు నెల రోజుల పాటు పశువైద్య సిబ్బంది (5) బృందాలుగా ఏర్పడి  గ్రామాలలోని పశువులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు వేయడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ వారు తెలిపారు. కావున పశువులు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంవర్ధక శాఖ ఎమ్ఏహెచ్ఓ సురేందర్  కొరడ మైనది.