సింగిల్విండో చైర్మన్ లకు గౌరవ వేతనం కల్పించాలి . "హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ కు వినతి

Published: Wednesday October 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా , అక్టోబర్18 , ప్రజాపాలన, ప్రతినిధి : 
 
సింగిల్విండో చైర్మన్ లకు గౌరవ వేతనం, ప్రోటోకాల్ కల్పించాలని మంగళవారం హైదరాబాద్లో సింగిల్ విండో రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగిల్విండో చైర్మన్ లకు గౌరవ వేతనం కల్పించాలని, అలాగే మండల సమావేశాలలో ఇతర సమావేశాలలో ప్రోటోకాల్  కల్పించాలని, కోరారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రమంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో సింగిల్విండో చైర్మన్ రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అలీ బిన్ హమ్మద్, (ఆసిఫాబాద్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, నాయకులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.