బెల్లంపల్లిలో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు : ఏసిపి రెహమాన్

Published: Friday May 21, 2021

బెల్లంపల్లి, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను  బెల్లంపల్లి సబ్ డివిజన్ లో పకడ్బందీగా అమలు చేస్తున్నమని బెల్లంపల్లి ఏ సి పి ఎం ఏ రహామాన్ తెలిపారు. బుధవారం నాడు రాత్రి సమయంలో బజార్ ఏరియాలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పత్రికలవారితో మాట్లాడారు. నిబంధనలు అందరికోసం అని ఏ ఒక్కరినో ఇబ్బందులకు గురి చేయాలని కాదని ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప సంబంధిత అధికారులతో పాసులు పొంది బయటకు రావాలని, నిబంధనలను ఉల్లంఘించి తమ ఇష్టారీతిన బయట తిరుగుతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.  అదేవిధంగా పట్టణంలో నిషేధించిన పొగాకు ఉత్పత్తులను అంబార్, పూల్చాప్, గుట్కా,కైనిలాంటి వాటికి సంబంధించిన ఉత్పత్తులను మరియు మద్యాన్ని నిల్వచేసి పట్టణంలోని పలు బస్తీలలో లాక్ డౌన్ సమయంలో అధిక రేట్లకు  దొంగతనంగా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తుందని ఈలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒక టౌన్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎం.రాజు, ఎస్ఐ రాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.