నాటుసారా తయారు దారులపై కఠిన చర్యలు
Published: Monday July 19, 2021
జన్నారం, జులై 18, ప్రజాపాలన ప్రతినిధి : గ్రామాలలో ఎవరైనా నాటుసారా తయారు దారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మండలంలోని చింతగూడ గ్రామంలో కార్డన్ చర్చ్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కలప అక్రమ రవాణా చేసినా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు, ఎలాంటి కాగితాలు లేని పలు మోటార్సైకిళ్లను అలాగే నాటు సారా తయారు చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు, ఈ కార్యక్రమంలో లక్షట్ పేట సిఐ నారాయణ నాయక్ జన్నారం ఎస్ఐ మధుసూదన్ రావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: