ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుకాణాలకు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు
Published: Monday December 06, 2021
కోరుట్ల, డిసెంబరు 05 (ప్రజాపాలన ప్రతినిధి) : మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో ఉన్న వ్యాపార సముదాయాలు మరియు చికెన్,మటన్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారి దగ్గర ఉన్న 75 మైక్రాన్ల కన్నా తక్కువ గల సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని వారికి జరిమానాలు విధించారు.ఎక్కువగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను కలిగి ఉన్న ఒక ప్లాస్టిక్ ఏజెన్సీకి 10,000 పదివేల రూపాయల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ డీ.గజనంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్ మరియు జవాన్లు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: