కరోనా వారియర్స్ అవార్డు అందుకున్న కార్పొరేటర్

Published: Friday March 05, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; రవీంద్రభారతిలోని మీర్ పేట్ 27 వ డివిజన్ కార్పొరేటర్  పసునూరి బిక్షపతి చారి కి కరోన వారియర్ అవార్డు అందజేశారు. ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం అసోసియేషన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి లోని మంగళవారం నాడు సంఘం అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డులు  అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బిజెపి జాతీయ బీసీ కమిషన్ ఆచారి, బీసీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర మీడియా కన్వీనర్ రామ్ రెడ్డి వారి చేతుల మీదగా మీర్ పేట్  బిజెపి 27 వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి కరోనా వారియర్స్ అవార్డు అందుకున్నారు.