పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Published: Wednesday April 13, 2022
మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెంచిన గ్యాస్, పెట్రోల్, కరెంట్ ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విచ్చలవిడిగా ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి అని వరి కొనుగోలు చేయకుండా గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ లాగా దొంగ నిరసన దీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వెంటనే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధనికుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఫయాజ్, షేక్ జహంగీర్, ఐఎన్టియుసి అధ్యక్షులు షేక్ బాజీ, ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్, కాంగ్రెస్ మహిళ నాయకులు తోమకుల రమ, లక్ష్మీస్వాతి, అరుణ, జానకి, స్వాతీ, లురదమ్మ, డివిజన్ కమిటీ అధ్యక్షులు మొదలగు వారు పాల్గోన్నారు.