రెండేళ్ల నుంచి చెబుతున్న పట్టించుకోవడం లేదు అల్లంపాటి అనంత రాములు ఆవేదన
Published: Wednesday November 30, 2022
తల్లాడ, నవంబర్ 29 (ప్రజా పాలన న్యూస్):
తమ ఇంటి సమీపంలో పాడుబడ్డ బావిని పూడ్చమని గత రెండేళ్లుగా చెబుతున్నా పంచాయతీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవటం లేదని తల్లాడకు చెందిన అల్లంపాటి అనంతరాములు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి సమీపంలో పాడుబడ్డ బావి ఉండటంతో మురికి నీరు చేరి దుర్వాసనతో దోమలు వృద్ధి చెంది అంటురోగాలు వస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు పాలకు వర్గానికి ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా పనులు చేస్తూ వదిలేస్తున్నారని గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు గ్రామసభలో ఈ విషయాన్ని చెబుతున్న పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను ఆయన తెలిపారు.
Share this on your social network: