ఫోటో, వీడియో గ్రాఫర్స్ మండల అధ్యక్షకార్యదర్శులుగా ఆంజనేయులు,నరేష్,..

Published: Thursday April 21, 2022
పాలేరు, ఏప్రిల్ 20, ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండల ఫోటో, & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆరెగూడెం గ్రామానికి చెందిన గొలుసు ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక వాసవీ భవన్ లో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఆయనతో పాటు గౌరవాధ్యక్షులుగా దండా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కొత్త కొండ వెంకటేశ్వరరావు, పొట్టపింజర వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కొమ్మూరి నరేష్, సహాయ కార్యదర్శులుగా కైలాసపు రేణు బాబు, పొట్టపింజర నరేష్ ప్రచార కార్యదర్శిగా ఎస్కే మౌలానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఫోటో, వీడియో గ్రాఫర్ కుటుంబ భరోసా స్కీంలో చేరాలన్నారు. అర్హులైన ఫోటో, వీడియో గ్రాఫర్లకు ప్రభుత్వం ఫెన్సన్ ఇవ్వాలని, బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు. అలాగే డబల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు జెర్రిపోతుల సత్య నారాయణ, జిల్లా నాయకులు నోముల నగేష్, సిద్దల శ్రీనివాస్, కొత్త నాగిరెడ్డి, హనుమంతరావు, దండా సత్య నారాయణ, ఏవిఎస్ రాజు, రామగిరి రవి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.