ముచ్చటగా మూడోసారి సిపిఎం మండల కార్యదర్శి గా చేతాళ్ల జంగయ్య
Published: Tuesday August 31, 2021
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 30 ప్రజా పాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం కప్పాడు సిపిఎం ముద్దుబిడ్డ ముచ్చటగా మూడోసారి ఇబ్రహీంపట్నం సిపిఎం మండల పార్టీ కార్యదర్శిగా చేతల జంగయ్య ఎన్నికైన నందున సిపిఎం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసారు. సోమవారం ఇబ్రహీం పట్నం మండలం దండుమైలారం గ్రామంలో జరిగినటువంటి సిపిఎం 8వ మండల మహాసభలు జరిగిన నేపథ్యంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి దుబ్బాక రామచందర్. జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల యాదయ్య. సిపిఎం పార్టీ శ్రేణుల సమక్షంలో 17 మంది కమిటీ సభ్యులతో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. కార్యదర్శి వర్గంగా 5 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. బుగ్గ రాములు, పి జగన్, డి. గణేష్, లింగస్వామి ఎన్నికయ్యారు . మండల కమిటీ సభ్యులు గా రవీందర్, వెంకటేష్, ఆనంద్, నరసింహ్మ, జంగయ్య, విగ్నేష్, యాదగిరి, మల్లేష్, రమేష్, సయ్యద్ ఉస్మాన్, జంగయ్య నూతన మండల పార్టీ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు బోడా సామెల్, సభ్యులు వెంకటేష్, రవీందర్, ఆనంద్, రాములు, ప్రకాష్ కారత్, విగ్నేష్, లింగస్వామి, మహేందర్, గణేష్, ప్రభాకర్, సిహెచ్. నరసింహ తదితరులున్నారు.
Share this on your social network: