పీర్జాదిగూడ శాంతివనం పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి మేయర్లు కార్పొరేటర్లు

Published: Monday June 27, 2022
మేడిపల్లి, జూన్26 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పుడమితల్లికి వృక్షార్చన పేరుతో 8వ విడత హరితహారం,ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక "హరితహారం" కార్యక్రమంలో భాగంగా "హరిత పీర్జాదిగూడ" నిర్మించాలనే సంకల్పంతో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శాంతివనం పార్క్ లో సుమారు12 వేల మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని మేయర్లు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, సిడిఎంఏ డైరెక్టర్ డా. ఎన్ సత్యనారాయణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.