టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Wednesday April 28, 2021

పటాన్చెరు, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్రకాంక్షను సాకారం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంగళవారం పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.