టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సంక్షేమం..

Published: Friday July 16, 2021
- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మెట్ పల్లి, జూలై 15 (ప్రజాపాలన ప్రతినిధి) : టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం జరుగుతోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం పట్టణానికి చెందిన సుమారు 200 మంది స్వర్ణకారులు, నాయకులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణ కారులకు పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధన దిశలో భాగంగా సీఎం కేసీఆర్ నిరంతరం అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు అందిస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రజా సంక్షేమ పథకాలను అందించడానికి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రోజురోజుకు ఒక బలమైన రాజకీయ శక్తిగా టిఆర్ఎస్ పార్టీ ఎదుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, మల్లాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణానికి చెందిన పలువురు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.