పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసిన యువనేత బీపీ నాయక్ ఎంత ఎత్తుకు ఎదిగినా తన చదువుకు

Published: Tuesday June 28, 2022
బోనకల్, జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని లక్ష్మీపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న  
నిరుపేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను యువనేత బీపీ నాయక్ అందజేశారు. సోమవారం లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిజెపి నాయకులు జంపాల రవి, కాలసాని పరశురామ్, భూక్య రమేష్ నాయక్ లు మాట్లాడుతూ ఎన్నారై బీపీ నాయక్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత ఉద్యోగాలు చేసే అందరూ గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు చేయూతనివ్వాలని, తను చిన్నతనం నుండి పేదరికంలో పెరుగుతూ గిరిజన హాస్టళ్లలో చదువుకొని తన ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకున్నారని, ఎంతోమందికి రోల్ మోడల్ గా ఉన్నారని విద్యార్థులందరూ నాయక్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, రిపోర్టర్ యంగాల గౌతమ్, గుగులోత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.