రాజకీయాలకతీతంగా ఆర్థికసాయం పంపిణీజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు*

Published: Saturday August 27, 2022

మధిర  ఆగస్టు 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాజకీయాలకతీతంగా పేద ప్రజలందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర మండలానికి చెందిన పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పేదలకు మంజూరైన నాలుగు లక్షల 46 వేల రూపాయల  విలువైన 11 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ, మరోవైపు పార్టీకి పట్టుగొమ్మలుగా ఉండి నిరంతరం సైనికుల్లా పని చేస్తున్నవారికి అండగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మధిరను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వివిధ జబ్బులతో ఆస్పత్రిలో చేరి మెరుగైన వైద్యం చేయించుకునేందుకు అప్పుచేసి వైద్యం చేసుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా కల్పించిందన్నారు. నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ టిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు ఎంపిపి మెండెం లలిత మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరావు, వై.వి అప్పారావు, జెవి రెడ్డి ఎర్రగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.