కార్పొరేషన్లో మంచి నీళ్ల సమస్య లేకుండా చూస్తా మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Friday April 30, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మంచి నీళ్ల సమస్య లేకుండా చూస్తానని నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ సూర్యోదయ కాలనీలో మున్సిపల్ జనరల్ ఫండ్ తో నూతన మంచినీళ్ల పైపు లైన్ను వేయించి అట్టి పైపులైన్ ద్వారా కాలనీలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కేతావత్ సుభాష్ నాయక్ తో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంచినీళ్ల నల్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, వాటర్ డిజిఎం కార్తీక్ రెడ్డి, మున్సిపల్ ఏఈ వినీల్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.