ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Published: Tuesday July 27, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ 26 జూలై ప్రజాపాలన బ్యూరో : ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నూతన రేషన్ కార్డులు అందిస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరామ్ నగర్ కాలనీకి చెందిన 31వ వార్డు కౌన్సిలర్ మాలే గాయత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం తీసుకోవచ్చని తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీ పంపిణీ ప్రక్రియ విడుతల వారీగా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.