అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
Published: Tuesday December 14, 2021
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని కోమటి కొండాపూర్ గ్రామ గోదావరి నది నుండి ఏలాంటి ప్రభుత్వ అనుమతీ లేకుండా. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆర్ఐ భూమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగింది సేపు కస్టడీ నిమిత్తం. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం ఆర్ఐ భూమేష్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తే భారీ మొత్తంలో జరిమానాలు విధించడమే కాకుండా ట్రాక్టర్లు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు దిలీప్, రాజు, నర్సయ్య లు పాల్గొన్నారు.
Share this on your social network: