బిపీ, షుగర్ పేషెంట్లకు ప్రత్యేక మెగా క్యాంపు విజయవంతం

Published: Monday August 08, 2022

బోనకల్, ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి: బీపీ షుగర్ పేషెంట్లు ప్రత్యేక మెగా క్యాంపును సద్వినియోగించుకోవాలని ఎంపీఓ ఏనుగు సురేష్ బాబు, ఆర్ఎంపీడబ్ల్యూఏ టిఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు లు కోరారు. మండల కేంద్రంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో అమరజీవి , పేద ప్రజల ఆశాజ్యోతి, సిపిఐ సీనియర్ నాయకులు తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్ధం మేఘ శ్రీ హాస్పటల్ నందు నిర్వహించే బీపీ, షుగర్ ప్రత్యేక మెగా క్యాంపు బీపీ, షుగర్ పేషంట్లకు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక క్యాంప్ లో రూ.100కే నెలకు సరిపడ బీపీ, షుగర్ మందులు అందజేస్తున్న బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. ఈ ప్రత్యేక క్యాంపు మండల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. బిపీ, షుగర్ వ్యాధు లతో బాధపడుతున్నవారు వైద్యకోసం ఖమ్మం, ఇతరత్ర పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. వీరికి సమయంతో పాటు నెలకు రూ.1000 నుండి రూ.2000 వరకు ఖర్చు తప్పుతుందన్నారు. మండల ప్రజలు ఈ క్యాంప్ ను స్వదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాసంగులపాటి కోటేశ్వరరావు, బిజెపి నాయకులు ఏనుగు సుమన్ బాబు, క్యాంప్ నిర్వహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్, సహాయకులు యంగల గిరి, భవాని తదితరులు పాల్గొన్నారు.