గుట్రాజ్ పల్లి గ్రామంలో అభివృద్ధి పనులతో బతకమ్మ సంబరాలు జరుపుకొన్న ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చ

Published: Tuesday October 12, 2021
జగిత్యాల, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్ పల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డిఎంఎఫ్ టి నిధులు 2.76 లక్షలతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత ప్రారంభించి అనంతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ అడినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దమ్మని విజయ లక్ష్మి, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, సర్పంచులు ఫోరమ్ అధ్యక్షుడు జాన్, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందాం, మండల యూత్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు  శ్రీనివాస్, మల్లేష్, గంగరాజం, మహేష్, తిరుపతి, అంజి, షేర్ల మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.