పరమశివుని అనుగ్రహంతో ప్రజలందరు క్షేమంగా ఉండాలి

Published: Monday February 20, 2023
*  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 19 ఫిబ్రవరి ప్రజాపాలన : పరమశివుని అనుగ్రహంతో ప్రజలందరు క్షేమంగా ఉండాలని పరమశివున్ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆకాంక్షించారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామ సమీపంలో గల పరమేశ్వరుని గుట్ట పై వెలసిన ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు పులుసు మామిడి గ్రామ సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, తలంబ్రాలు అర్పించారు.  పరమేశ్వరుని గుట్టపై నిర్వహించిన పార్వతీపరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని, స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల పరిషత్తు అధ్యక్షురాలు కామిడి చంద్రకళ కమాల్ రెడ్డి, కొటాలగూడ గ్రామ సర్పంచ్ రాములు నాయక్, కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి, శివారెడ్డి పెట్ పిఎసిఎస్ పులుసు మామిడి గ్రామ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బురాన్పల్లి అనిల్,  ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.