భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనం చేయాలి కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి -ప్రజా పాలన /సెప్టెంబర్ 6 : వినాయకుని భక్తిశ్రద్దలతో కొలవడమే కాదు, అంతే భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య నిమజ్జనం చేయాలని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడా, కొండాపూర్, హాఫీజ్ పెట్, హుడా కాలనీ నందు ఏర్పాటు చేసిన వినాయక మండపల వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని పలు ప్రాంతాలలో వాడ వాడలా భారీ మండపాలు ఏర్పాటు చేసి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భక్తిశ్రద్ధలతో ముక్కోటి దేవతల ముహుర్తపు పూజలందుకునే గణపయ్యాకు ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. వాడ వాడలా కొలువుదీరి పూజలు అందుకున్న గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు అంతా సిద్ధమవుతున్న సందర్భంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండపాల పుస్తక కమిటీ సభ్యులకు సూచించారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
Share this on your social network: