ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీపీ దేవరకొండ శిరీష.

Published: Wednesday April 19, 2023

ఎర్రుపాలెం ఏప్రిల్ 18 మంగళవారం( ప్రజాపాలన ప్రతినిధి) మండల కేంద్రంలోని ఎర్రుపాలెం గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని స్థానిక ప్రజాపతినిధులను.ప్రేమపూర్వ విందుకు ఆహ్వాన పలికిన ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా ఎంపీపీ దేవరకొండ శిరీష మాట్లాడుతూ రంజాన్ తెచ్చిన చంద్రుడు దేశమంతా స్నేహపూర్వక వెన్నెల కురిపించాలని. మతాలను మరిచి మమతానురాగాలతో మెలగాలని .విశ్వమానవ సోదర భావాన్ని దేశమంతా చాటాలని పేద ,గొప్ప,దనిక ,తారతమ్యాలు, లేకుండా మత సామ్రాజ్యాన్ని దేశానికి చాటిచెబుతున్నా .ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.,. అదే విధంగా ఈ ఇందు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మొగిలి అప్పారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పంబి. సాంబశివరావు, ఎంపీటీసీ మస్తాన్వలి ,ఇస్మాయిల్ ,బాబు సా,మత పెద్దలు పాల్గొన్నారు.