వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Friday June 04, 2021
జగిత్యాల, జాన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల అర్బన్ మండల హస్నాబాద్ గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి మ్యాంగో సెంటర్ నిర్వహకులు కడార్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు 50 వేల రూపాయలు విలువగల నిత్యావసర సరుకులను జగిత్యాల ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారెడ్డి కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్ కూసరి అనిల్ ఆనంద్ రావు ఏఎంసి డైరెక్టర్ మోహన్ రెడ్డి తిరుపతి తదితరులు ఉన్నారు.