జాతీయ బిసి కమిషన్ ఛైర్మెన్న్ సన్మానించిన బిజెపి నాయకులు
Published: Tuesday December 20, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: వెనుక బడిన తరగతుల జాతీయ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం ఆహిర్ ను బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం నియోజక వర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూల మాలలు, శాలువాలతో, ఘనంగ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, హన్సరాజ్ నియామకం వల్ల బిసి సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో మేలు చేకూరుతుందని, ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, రాజులాల్ యాదవ్, గోవర్దన్, రామయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: