మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న భవనాల పై విచారణ చేసిన తాసిల్దార్ రాజేష్ కమిషనర్ రమాదేవి.
Published: Wednesday February 02, 2022
మధిర ఫిబ్రవరి ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మండల పరిషత్ కార్యాలయం పక్కన అనేక సంవత్సరాలుగా అక్కడ సుమారు 25 కుటుంబాలు జీవనం చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలతో ఆ స్థలంలో నివాసం ఉంటున్న వారిని విచారించగా కొంతమంది వారి వద్ద ఉన్న పత్రాలు రశీదులు చూపించారు. వారి వద్ద ఉన్న రసీదులు పత్రాలను పరిశీలించిన అధికారులు పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్ కి అందిస్తామని అప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని ఈ విషయం మొత్తం జిల్లా కలెక్టర్ చూసుకుంటారని తాసిల్దార్ రాజేష్ కమిషనర్ రమాదేవి పేర్కొన్నారు
Share this on your social network: