ఎస్సై పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ** జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు

Published: Wednesday August 03, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు 02(ప్రజాపాలన, ప్రతినిధి) : ఈ నెల 7న నిర్వహించబోయే పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్యార్లకు, రీజినల్ కోఆర్డినేటర్స్, "పోలీస్ సిబ్బందికి "శిక్షణ అవగాహన కార్యక్రమం" వహించారు. పరీక్ష సమయంలో సిబ్బంది పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. జిల్లాకేంద్రంలో 3,కాగజ్ నగర్ లో 3, పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని,1492 మంది అభ్యర్థులు ఎలిమెంటరీ పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు.ఉదయం 10 గంటల నుండి, మధ్యాహ్నం 01 గం వరకు నిర్వహించాలన్నారు. అదనపు ఎస్పి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.