మధిర రామాలయం లో సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు

Published: Tuesday April 20, 2021
మధిర, ఏప్రిల్ 19, ప్రజాపాలన ప్రతినిధి : రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకొని మధిర రామాలయంలో రామాలయం చైర్మన్ దొడ్డ మురళి ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. పెళ్లి పనుల్లో భాగంగా ఈ రోజు స్వామి వారిని పెళ్ళికొడుకుగా అలంకరించడం, పసుపు కొట్టటం, కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంకరాచారి విశ్వనాథన్ఆలయ సిబ్బంది ప్రజలు భక్తులు పాల్గొన్నారు అనంతరం స్వామి కృపకు పాత్రులు కాగలరని తీర్థప్రసాదాలు వితరణ చేశారు