హైటెక్ సిటీ లో ప్లీనరీ సమావేశానికి హాజరైన కార్యకర్తలు

Published: Wednesday October 27, 2021
బాలాపూర్:అక్టోబర్ 25, ప్రజాపాలన (ప్రతినిధి) : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ వివిధ విభాగాల అధ్యక్షులు తోపాటు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో సోమవారం హైటెక్ సిటీ లో జరిగిన ప్లీనరీ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, సీనియర్ తెరాస ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, యూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి జటావత్ రవి నాయక్, కార్పోరేషన్ కార్పొరేటర్లు గజ్జల రామచందర్, బరంగ్ పేట్ కార్పొరేటర్ పెద్ద సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కిషోర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.