శంకరపట్నంలో టీఆర్‌ఎస్ సంబురాలు

Published: Monday November 07, 2022
శంకరపట్నం మండల కేంద్రంలో ఆదివారం అంబెడ్కర్ కూడలి వద్ద జరిగిన వేడుకల్లో తెరాస పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ  భారీఎత్తున సంబరాలు చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సందర్బంగా ఆదివారం మండలకేంద్రంలో  తెరాస నాయకులూ కార్యకర్తలు భారీగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో శంకరపట్నం  జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్,  పార్టీ మండల అధ్యక్షుడు గంటా మహిపాల్, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వీరస్వామి వైస్ ఎంపీపీ పులికోట రమేష్ నాయకులు సతీష్ రెడ్డి, అలీం శ్రీనివాస్ రవి, సుధాకర్, కుమార్, వెంకటేష్, పార్టీ  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.