రూ 48 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Published: Thursday April 21, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డితో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి  వివేకానంద కాలనిలో రూ 25 లక్షలతో  సీసీ రోడ్డు పనులు మరియు తరపురి కాలనిలో రూ 8లక్షలతో కూడిన ప్రహరీ గోడ పనులు మరియు మారుతి నగర్లో రూ15 లక్షలతో కూడిన ప్రహరీ గోడ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కాంగ్రెస్ నాయకులు కొత్త స్రవంతి కిషోర్ గౌడ్,కాలనీ వాసులు పాల్గొన్నారు.