మానవత్వం చాటుకున్న మధిర టౌన్ ఎస్సై డ్రైవర్
Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోనీ మడుపల్లి గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ60 కు చెందిన సుమారుగా వెయ్యి రూపాయల నగదు, 700 గ్రాముల వెండి పట్టీలు ఉన్న పర్సు పోగొట్టుకున్నది మధిరలో కొండ టీ స్టాల్ సమీపంలో కొండ తనయుడు మధిర టౌన్ ఎస్సై డ్రైవర్ పబ్బతి అయ్యప్ప కు పర్సు దొరికింది దానిని పోగొట్టుకున్న వృద్ధ మహిళలకు అట్టి పర్సును అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా అయ్యప్ప మానవీయ గుణాన్ని చూసి మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
Share this on your social network: