ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాల్లో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
Published: Tuesday July 26, 2022
జగిత్యాల, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి): పిఆర్ టియూ టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఓల్డ్ హై స్కూల్లో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాల్లో జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతీ శుభ కార్యాల్లో గోరింటాకు ప్రత్యేకత ఉంటుందని అన్నారు. శరీరంలోని వేడిని గ్రహించి చల్లదనాన్ని ఇస్తుంది, అంతేకాకుండా చర్మవ్యాధులు సంబంధించిన రోగాలు రాకుండా కాపాడుతుందని అన్నారు. వయస్సు తో సంబంధం లేకుండా మహిళలందరూ గోరింటాకును ఇష్టపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గాయిత్రి, జానకి, జమున, అనిత,వసంత, చెందన, విద్యా, రాధ, నాగ రాణి, సరోజ, శ్రీదేవి, జయ శ్రీ, రచన తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: